వాగ్దాన భంగము'-ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు. Degree 4th sem Telugu syllabus
పాఠ్యభాగము: 'వాగ్దాన భంగము' దేని నుండి గ్రహింపబడింది .'తాలంక నందినీ పరిణయము'లోని చతుర్ధాశ్వాసం.నుండి గ్రహింపబడింది. కవి : ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు. కాలము : క్రీ.శ. 1817-1880 ల మధ్యకాలంలో జీవించాడు. కవిగారి రచనలు . : తాలాంక నందినీ పరిణయము', 'ఇందిరాల భాగవతము (యక్షగానం) కవిగారి తండ్రి : కవి గారి తండ్రి "భావనాచార్యులు”, తన తండ్రి. మహా ప్రతిభావంతుడని, వేదాంత శాస్త్ర నిష్ణాతుడని, ఈ కవి స్వయంగా చెప్పుకున్నాడు. కవిగారి నివాసము ఈ కవి తన చరమ దశలో నల్లగొండ జిల్లా కనగల్లులో జీవించాడు. ఈయన బ్రతుకుదెరువు కోసం, వేర్వేరు ప్రాంతాల్లో నివసించాడని తెలుస్తోంది. కవిగారి జీవన విధానము : కవిగారితో పాటు ఈ వంశీయులు, తెలంగాణలో ఆచార్య పీఠం పొంది, శిష్యులతో సంచారం చేస్తూ ధార్మిక చింతనను మేల్కొల్పారు. పాఠ్యభాగ సందర్భం : తాలంకుడు' అంటే బలరాముడు. బలరాముని కూతురు శశిరేఖ. బలరాముని చెల్లెలు సుభద్ర. ఈమె అర్జునునికి భార్య, సుభద్రార్జునుల పుత్రుడు 'అభిమన్యుడు',' శశిరేఖా, అభిమన్యులు, మేనత్త మేనమామల బిడ్డలు. చిన్నప్పటి నుండి వారిద్దరికీ ప్రేమ చిగురించింది. తల్లిదం